అతడు (2005), ఖలేజా (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న లేటెస్ట్ ఫిల్మ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రారంభో త్సవం హైదరాబాద్లో జరుగనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తారు. కథ ప్రకారం మరో హీరోయిన్కి కూడా చోటు ఉందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను గత ఏడాది మే1న అధికారికంగా ప్రకటించారు.అప్పుడు ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలిసి చేయనున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ‘సర్కారువారిపాట’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్బాబు. ఈ చిత్రం హీరో మహేశ్, హీరోయిన్ కీర్తీ సురేశ్లు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడింది. అయితే ఇటీ వల మహేశ్, కీర్తీ కోలుకోవడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టారై్టంది. ప్రస్తుతం కీర్తీ సెట్స్లో పాల్గొంటున్నారు. మహేశ్ మూడు రోజుల్లో ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవుతారు. ఈ ఏడాది మేలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రంయూనిట్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.