ప్రముఖ దర్శకులు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ సినిమాలో శాంకతలగా సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలోని ప్రిన్స్ భరత పాత్రకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్కుమార్తె అల్లు అర్హను ఎంపికచేసుకున్నారు దర్శకులు గుణశేఖర్. ఇంతకుముందు గుణశేఖర్ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తన కూతురి ఎంట్రీ గురించి అల్లుఅర్జున్ మాట్లాడుతూ–‘‘అల్లు ఫ్యామిలీ గర్వపడేసమయం ఇది. అల్లు ఫ్యామిలీ ఫోర్త్ జనరేషన్ నుంచి అల్లు అర్హ శాకుంతలం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా తో నా కూతురు అర్హ తొలి అడుగు వేస్తున్నందుకు దర్శకులు గుణశేఖర్, నీలిమగుణలకు థ్యాంక్స్. ఇక సమంతో ఇది వరకు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు తన సినిమాలో అర్హ నటించనుంది. అర్హ ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుందో నన్న ఆసక్తి నాలో ఉంది’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.