Pawan Kalyan: పవన్కళ్యాణ్ (Pawan Kalyan) అజ్ఞాతవాసి సినిమా చూసిన వారికి ప్లాన్ బీ కాన్సెప్ట్ బాగా గుర్తు ఉండొచ్చు. అయితే పవన్కళ్యాన్తో ప్రస్తుతం సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులు కూడా ప్లాన్ బీ కాన్సెప్ట్కు రెడీ అవ్వాల్సిన పరిస్థతి. పవన్కళ్యాణ్ ప్రజెంట్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఇటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్కళ్యాణ్ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో పవన్తో సినిమాలు కమిటైన దర్శకులు ప్లాన్ బీ రెడీ చేసుకుని సినిమాలు చేస్తున్నారు.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాను 2020 సమయంలో స్టార్ట్ చేశారు పవన్కల్యాణ్. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. ఏఎమ్ రత్నం నిర్మాత. సినిమా మొదలై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ 60శాతమే పూర్తయిందని తెలిసింది. ఓ దశలో సెకండాఫ్ విషయంలో పవన్కు, క్రిష్కు ఏకాభిప్రాయం కుదర్లేదన్నవార్తలు వినిపించాయి. ఆ తర్వాత బడ్జెట్ ఇష్యూస్తో ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందంటున్నారు. ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ప్లాన్ బీలో భాగంగా దర్శకుడుక్రిష్ ‘కొండపొలం’ తీశాడు. వైష్ణవ్తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు పవన్ కూడా వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ప్లాన్ బీలో భాగంగానే కొత్త ప్రాజెక్ట్ కోసం కథను రెడీ చేసుకుంటున్నాడు క్రిష్. ఓ వెబ్సిరీస్ను రూపొందించే పనిలో కూడా ఆయన ఉన్నట్టుగా తెలిసింది.
‘గబ్బర్సింగ్’ తర్వాత పవన్కల్యాణ్తో మరో సినిమా చేయాలని దర్శకుడు హరీష్శంకర్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. అలా ఉస్తాద్భగత్సింగ్ (Ustaad Bhagat Singh)ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా సెట్స్పైకి వెళ్లింది. కానీ 20శాతం కూడా పూర్తి కాలేదు. పవన్ కాల్షీట్స్పై క్లారిటీ లేకపోవడంతో ఇక చేసేది ఏం లేక..ప్లాన్ బీలో భాగంగా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ స్టార్ట్ చేశాడు హరీష్శంకర్. ఈ ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
పవన్కళ్యాణ్తో ప్రస్తుతం ఓజీ (They call him OG) చేస్తున్నారు యువ దర్శకుడు సుజిత్. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం కూడ జరుగుతోంది. తొలిభాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందట. అయితే పవన్తో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. అయితే సుజిత్కు పవన్కోసం వెయిట్ చేసి సమయాన్ని వృధా చేసుకోకూడదని నానితో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. ‘ఓజీ’ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ దానయ్య…సుజిత్-సుజిత్ల సినిమాకు కూడా నిర్మాతగా ఉంటారట.
రామ్తాళ్లూరి నిర్మాతగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రావాలి. కానీ రాలేదు. దీంతో సురేందర్రెడ్డి అఖిల్తో ఏంజెంట్ చేశారు. పీపుల్మీడియాఫ్యాక్టరీ, పవన్కళ్యాణ్ క్రియేటివ్ సంస్థలతో పవన్-త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సింది. ఈ లోపు త్రివిక్రమ్ ‘గుంటూరుకారం’ చేసేశారు మహేశ్బాబుతో..
పై విషయాలను గమనిస్తుంటే పవన్కళ్యాణ్తో సినిమా అంటే ఆ దర్శకులకు కచ్చింగా ప్లాన్ బీ అనేది ఉండి తీరాలని తెలుస్తోంది కదూ