జూనియర్ ఎన్టీఆర్తో టెంపర్ హిట్ తర్వాత అరడజను (జ్యోతిలక్ష్మీ, లోఫర్, ఇజం, రోగ్, పైసావసూల్, మెహబూబ) ) ప్లాష్ మూవీస్ తీశారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ‘నేను..శైలజ’ తర్వాత హీరోగా రామ్చేసిన ఏ సినిమా కూడా అతనికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలా2019 సమయానికి హీరో రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్..ఈ ఇద్దరికీ ఓ హిట్ అవరమైంది. దీంతో ఈ ఇద్దరూ కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతీశారు. బ్లాక్బస్టర్గా నిలిచింది. కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
ఇస్మార్ట్శంకర్ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్దేవరకొండతో ‘లైగర్’ తీశాడు. డిజాస్టర్గా నిలిచింది. దీంతో పూరీజగన్నాథ్ విజయ్తో కమిటైన జనగణమన చిత్రం షూటింగ్ ప్రారంభించుకున్నప్పటికీని ఆగిపోయింది. ఎందుకంటే ‘లైగర్’ రిజల్ట్ కారణంగా. దీంతో పూరీజగన్నాథ్తర్వాతి చిత్రంపై చాలా రూమర్స్ వినిపించాయి. చిరంజీవి, పూరీజగన్నాథ్కాంబినేషన్లో సినిమా రూపొందుతుందని అంతా ఊహించారు.కానీ పూరీ చెప్పిన కథ చిరంజీవిని ఇంప్రెస్ చేయలేకపోయిందట. ఆ తరుణంలో పూరీ జగన్నాథ్ రామ్ను సంప్రదించగా, కథ విన్న రామ్ సూత్రప్రాయంగా ఒకే అన్నారట. దీంతో పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్స్లో మరో సినిమా రావడానికి చర్చలు జరుగుతన్నాయి. అయితే అది ‘ఇస్మార్ట్శంకర్’ సినిమాకు సీక్వెలా? లేక విజయ్దేవరకొండతో ఆగిపోయిన ‘జనగణమన’ సినిమాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయినా ‘లైగర్’ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ పూరీకి చాన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నారు. శ్రీనివాసచిట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదల కానుంది.