సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా విమల్కృష్ణ దర్శకత్వంలో త్రివిక్రమ్, సూర్యదేవర నాగవంశీ
నిర్మించిన చిత్రం ‘డీజే టిల్లు’. ఈ నెల 12న విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద న లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్లో
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో నేను ఇప్పటి వరకు బ్లాక్బస్టర్ అనే పదం వినలేదు. థియేటర్స్లో మేం పదిశాతమే వర్కౌట్ అవుతాయనుకున్న సీన్స్ అన్నింటీకీ అంతకుమించిన రెస్సాన్స్ వస్తోంది. తమన్గారి బ్యాక్గ్రౌండ్ మంచి ఫ్లస్ అయ్యింది. రచయితగా నేను స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి డీజే టిల్లు క్యారెక్టర్లో ఒదిగిపోయాను. మా స్క్రిప్ట్ను చూసి ఏ సీన్స్కి అయితే త్రివిక్రమ్గారు మంచి రెస్సాన్స్ వస్తుందని చెప్పారో వాటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్గారికి సినిమాపై ఉన్న అవగాహనకు ఇదో నిదర్శనం. ఆయన పరిచయం మాకు అదృష్టం’’ అన్నారు.
నిర్మాత సూర్యదేవర ‡నాగవంశీ మాట్లా డుతూ–‘‘డీజే టిల్లు’లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం మరింత వస్తుంది. కొత్తవారిని మరింత ప్రోత్సహించాలనిపిస్తుంది. చిన్న సినిమాలను ఎందుకు చేస్తారని కొందరు అడిగారు. కానీ చిన్న సినిమాలు ఇచ్చే విజయాలు మంచి సంతృప్తిని ఇస్తాయి. డీజే టిల్లు సినిమా సీక్వెల్నే సిద్దు నెక్ట్స్ పిక్చర్గా మా బ్యానర్లో చేస్తున్నాం’’ అన్నారు . ‘‘మా సినిమాను ప్రేక్షకులు థియేటర్సోలో చూసి ఎంజాయ్ చేస్తోన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఇక ఈ సినిమా డైలాగ్స్కు వస్తున్న క్రెడిట్ అంతా నేను సిద్ధుకే ఇస్తాను. నిర్మాతగా నాగవంశీగారి నమ్మకం, మా కష్టం డీజే టిల్లు సినిమా సక్సెస్కు కారణమని నమ్ముతున్నాం’’ అన్నారు దర్శకుడు విమల్కృష్ణ.