విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ ఫిల్మ్గా ‘లైగర్’ వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘లైగర్’ సినిమా చివరి షెడ్యూల్ ముంబైలో స్టారై్టంది. ఈ చిత్రంలో అనన్యాపాండే హీరోయిన్గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్పాండేకీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను పూరీజగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్జోహార్, అపూర్వమెహతా నిర్మిస్తున్నారు.లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ముంబై వీధుల్లో తిరిగే ఓ గల్లీ కుర్రాడు అంత ర్జాతీయ బాక్సింగ్ ఫైటర్గా ఎలా మారాడు? అన్నదే కథ.
ఇక ‘లైగర్’ తర్వాత హీరో విజయ్దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమామా ‘జనగణమన’ రూపొందనుందని, ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీకపూర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహామాన్ ఉంటారనే
వార్తలు వస్తున్నాయి. అలాగే దర్శకుడు శివనిర్వాణ, సుకుమార్లతో విజయ్ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు
ఒప్పుకున్న సంగతి తెలిసిందే.