సర్కారువారిపాట చిత్రంలోని పాటల కోసం మహేశ్బాబు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్, సంక్రాంతి పండగ సందర్భాల్లో సర్కారువారిపాట చిత్రంలోని తొలి పాటను విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. కానీ ఇప్పుడు సర్కారువారి పాట చిత్రంలోని తొలిపాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇక మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సర్కారువారిపాట చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.