మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరుకారం’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘ఓ మై బేబీ’ పాటకు నెటిజన్ల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదరైంది. ఇందులో మహేశ్ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ‘ఓ మైబేబీ’ పాట రామ్జోగయ్యశాస్త్రి లిరిక్స్ రాయగా, శిల్పారావు పాడారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి విడుదలైన తొలిపాట ‘దమ్ మసాల’కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించగా, ‘ఓ మై బేబీ’ మాత్రం బెడిసి కొట్టింది. దీంతో ‘గుంటూరుకారం’ సినిమాపై ఉన్న అంచనాలు కాస్త తగ్గాయి. అయితే ‘గుంటూరుకారం’ సినిమా నుంచి ‘ఓ మై బేబీ’ విడుదలైన రోజే, ప్రభాస్ ‘సలార్’ నుంచి రిలీజైన ‘సూరీడు’ పాటకు మంచి స్పందన లభించింది. ‘ఓ మై బేబీ’ డౌన్ఫాల్కు ‘సూరీడు’ పాట కూడ ఓ కారణం కావొచ్చు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా, మీనాక్షీ చౌదరి, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ‘గుంటూరుకారం’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.