హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్లో కనిపిస్తారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85శాతం పూర్తయింది. ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారుమేకర్స్. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరుణ్మా థేశ్వర న్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.’కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.