కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా మలయాళ సినిమాలే చేశారు మలయాళ బ్యూటీ కీర్తీ సురేష్. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసిన కీర్తీ సురేష్ ఆ తర్వాత మాలీవుడ్ సినిమాలు తగ్గించారు. 20 14లో వచ్చిన ‘రింగ్ మాస్టర్’ తర్వాత మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత మోహన్లాల్ ‘మరక్కర్: ది అరబి కడలింటే సింహం’ చిత్రంలో ఓ కీ రోల్ చేశారు. మళ్లీ ఇప్పుడు హీరోయిన్గా మలయాళంలో మరో సినిమాకు కీర్తీ పచ్చజెండా ఊపారని సమాచారం. టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ‘వాషి’ చిత్రంలో కీర్తీ హీరో యిన్గా నటించనున్నారు. విష్ణు దర్శకత్వం వహిస్తున్న ఈ ‘వాషి’ చిత్రం షూటింగ్ తిరువనంతపురంలో మొదలైంది. ఇలా కొంతగ్యాప్ తర్వాతి కీర్తీ మళ్లీ ఓ మాలీవుడ్ సినిమాకు సైన్ చేయడంతో అక్కడి ఆమెఅభిమానునులు హ్యాపీ ఫీలవుతున్నారు.