Kalki2898ADPostponed: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ వైజయంతీమూవీస్ 50 సంవత్స రాలను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898ఏడీ’ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్కు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. హీరోయిన్స్ దీపికా పదుకొనె, దిశాపటానీ హీరోయిన్స్గా కనిపిస్తారు. అమితాబ్బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2024 మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ మే 13న ఆంధ్రప్రదేశ్లోని అంసెబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ‘కల్కి 2898ఏడీ’ సినిమా వాయిదా పడటం దాదాపు ఖరారైనట్లే (Kalki2898ADPostponed).
కాకపోతే మే 9 అనేది వైజయంతీమూవీస్ అధినేత సి.అశ్వనీదత్కు లక్కీ రిలీజ్ డేట్. చిరంజీవి–శ్రీదేవీల ‘జగదేకవీరుడు– అతిలోకసుందరి’, కీర్తీ సురేష్ ‘మహానటి’, మహేశ్బాబు ‘మహర్షి’ (నిర్మాణ భాగస్వామి) సినిమాలు మే 9న విడుదలై, విజయాలు సాధించాయి. ఈ సెంటిమెంట్ సక్సెస్ను కంటిన్యూ చేస్తూ మే 9న ‘కల్కి 2898ఏడీ’ సినిమాను కూడా విడుదల చేయాలని అనుకున్నారు సి.అశ్వనీదత్. కట్ చేస్తే..‘కల్కి 2898ఏడీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇలా ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు వైజయంతీమూవీస్కు ఉన్న హిట్ సెంటిమెంట్ కలిసి రాలేదు. ఒకవేళ ఎన్నికలు రాకపోయినప్పటికీని ‘కల్కి2898ఏడీ’ సినిమా వాయిదా పడేదని, గ్రాఫిక్స్ వర్క్ చాలా పెండింగ్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
NagAshwinKalki2898AD: అందుకే మా సినిమాకు ‘కల్కి 2898ఏడీ’ టైటిల్ పెట్టాం: నాగ్ అశ్విన్
అప్పట్లో ‘దేవదాసు’ (నాగార్జున–నాని నటించిన చిత్రం) ప్రమోషన్స్లో భాగంగా సి. అశ్వనీదత్ మాట్లా డుతూ ‘కల్కి2898ఏడీ’(అప్పట్లో ప్రాజెక్ట్ కె టైటిల్ ఉండేది) సినిమాను తొలుత 2023 అక్టోబరులో దసరాకు విడుదల చేస్తామన్నట్లుగా పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత జనవరి 12, 2024కి రిలీజ్ను వాయిదా వేశారు.ఆ తేదీకి కూడా ‘కల్కి 2898ఏడీ’ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత మే 9, 2024కి చెప్పారు.కానీ ఊహించని విధంగా ‘కల్కి 2898ఏడీ’ సినిమా విడుదల వాయిదా పడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
PrabhasKalki2898AD: కల్కిలో భైరవ…కానీ….
Prabhas Kalki2898AD: ప్రభాస్కు హాలీవుడ్ అడ్డంకి
మహాభారతం ముగిసిన తర్వాత మొదలైయ్యే ఈ సినిమా కథ 2898ఏడీ వరకు అంటే…6 వేల సంవత్స రాల టైమ్ పీరియడ్లో జరుగుతుంది. ఈ సినిమాలో విష్ణుతత్త్వం కూడా ఉంది. ‘కల్కి 2898ఏడీ’ చిత్రంనాలుగైదు భాగాలుగా విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె,భైరవ పాత్రలో ప్రభాస్, కల్కి పాత్రలో కమల్హాసన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్బచ్చన్ నటిస్తున్నారనితెలిసింది. రాజమౌళి, విజయ్దేవరకొండ, దుల్కర్సల్మాన్, ఎన్టీఆర్లు ఈ సినిమాలో అతిథి పాత్రలుగాకనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు తొలుత మిక్కీ జే మేయర్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత సంతోష్నారాయణన్ ఫైనలైజ్ అయ్యారు.