సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో ఓ సినిమా రూపుదిద్దుకోవాల్సింది. కానీ కుదర్లేదు. కానీ ఈ సినిమాను అల్లు అర్జున్ చేసి సూపర్హిట్ కొట్టాడు అదే ‘పుష్ప’ చిత్రం. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప’ చిత్రంలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.మలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను 2024లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఇక రెండు సంవత్సరాల క్రితం అంటే ‘అర్జున్రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్సింగ్’గా సందీప్రెడ్డి వంగా రీమేక్ చేస్తున్న సమయంలో మహేశ్బాబుకు ఓ కథ చెప్పారు. సేమ్ మహేశ్కు ఈ కథలోని సెకండాఫ్ నచ్చలేదట. ఆ కథ అల్లు అర్జున్కు నచ్చడంతో సందీప్తో సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు అల్లఅర్జున్. ఆయన కెరీర్లో ఇది 23వ సినిమా రూపొందనుంది. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణసంస్థ టీసిరీస్
బ్యానర్లో భూషణ్కుమార్, బద్రకాళి ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి.
ప్రస్తుతం ‘రణ్బీర్కపూర్తో యానీమల్ సినిమా చేస్తున్నారు సందీప్రెడ్డి వంగా. ఈ సినిమా పూర్తికాగానే ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమాను చేస్తారు. ఆ నెక్ట్స్ అల్లు అర్జున్, సందీప్ల ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుంది. ఇక ప్రస్తుతం సుకుమార్తో ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ నెక్ట్స్ తనకు ‘రేసుగుర్రం’లాంటిబంపర్హిట్ ఇచ్చిన సురేందర్రెడ్డితో సినిమా చేస్తారు. ఒకవేళ సురేందర్రెడ్డి స్క్రిప్ట్ కుదరకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్తో నాలుగో సినిమా చేస్తారు. గతంలో త్రివిక్రమ్– అల్లు అర్జున్ల కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల ..వైకుంఠ పురములో..’ అనే సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రస్తుతం మహేశ్బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.