హీరో రజనీకాంత్ మంచి జోరు మీద ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోని ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్.రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూ టింగ్ చెన్నైలో జరుగుతోంది. సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.
‘జైలర్’ సినిమా సెట్స్పై ఉండగానే ‘లాల్సలామ్’ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. ఆయన కుమార్తె ఐశ్వర్యారజనీకాంత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విష్ణువిశాల్, విక్రాంత్లు హీరోలుగానటిస్తారు. అయితే ఇందులో రజనీకాంత్ ఓ కీ రోల్ చేయనున్నారు. క్రికెట్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈసినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
ఇక తాజాగా రజనీకాంత్ 170వ సినిమా కూడా ఖరారైపోయింది. ‘జై భీమ్’ వంటి సూపర్డూపర్ హిట్ను తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శ కత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ‘దర్భార్’ (2020), ‘2.ఓ’(2018) చిత్రాల తర్వాత లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్తో రజనీకాంత్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ స్టార్ట్ కానుంది. 2024లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.