పవన్కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ సినిమాను ఇటీవల ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే ఏపీలోని థియేటర్స్లో వందశాతం థియేటర్స్ ఆక్యూపెన్సీ, నైట్కర్ఫ్యూ
ఎత్తివేత వంటి అంశాలను ఆశించారు చిత్రంయూనిట్. రెండు రోజుల క్రితం ఏపీలో నైట్కర్ఫ్యూను
ఎత్తివేసినా థియేటర్స్లో వందశాతం ఆక్యూపెన్సీ లేదు కాబట్టి భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25
అంటే ఈ నెల 25న విడుదల కావడం లేదని అందరు భావించారు.
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ విడుదల కావడం లేదు కాబట్టి ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యేందుకు శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, వరుణ్తేజ్ ‘గని’, ‘సెబాస్టిషియన్ పీసీ 527’, ఆలియాభట్ ‘గంగుభాయి కతి
యావాడి’ అజిత్ ‘వలిమై’ చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. ఆల్రెడీ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ను కూడ స్టార్ట్ చేశాయి. అయితే ఈ తరుణంలో భీమ్లానాయక్ చిత్రాన్ని ఈ నెల 25నే రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రకటించారు. దీంతో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu), వరుణ్తేజ్ ‘గని’(Ghani) ‘సెబాస్టిషియన్ పీసీ 527’, ఆలియాభట్ ‘గంగుభాయి కతి యావాడి’ చిత్రాలు రిలీజ్లు ప్రశ్నార్థకంగా మారాయి.
వలిమై తెలుగు ట్రైలర్ను లాంచ్ చేసిన హీరో మహేశ్బాబు
అయితే అజిత్ తమిళం సినిమా, గుంగుభాయి కతియావాడి (Gangubai Kathiawadi) హిందీ సినిమా..సో..భీమ్లానాయక్ (భీమ్లానాయక్ హిందీ వెర్షన్ హిందీలో రిలీజ్ అవుతున్నప్పటికీని అక్కడ పవన్కు పెద్దగా మార్కెట్ లేదు). ఈ రెండు చిత్రాలకు ఆ రాష్ట్రాల్లో వచ్చిన సమస్య ఏం లేదు. ఎటొచ్చి వరుణ్తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రాలకే పెద్ద సమస్య. భీమ్లానాయక్ సినిమా వస్తే..ఈ రెండు తప్పక వాయిదా పడని పరిస్థితి.
ఇక భీమ్లానాయక్ (Bheemla nayak)సినిమా విషయానికి వస్తే…పవన్కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవరనాగవంశీ నిర్మించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో పవన్కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్యారాజేష్ కనిపిస్తారు. మలయాళం హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్కు తెలుగు రీమేక్గా భీమ్లానాయక్ చిత్రం రూపొందింది.