పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత యాంగ్రీ,యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. ఇది యాక్షన్ హీరో విశాల్ కు కెరీర్లో 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో మెప్పించిన మృణాళిని రవి ఈ ఎనిమీ లో కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిం చిన ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తయింది.


‘‘ఎనిమీ’ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్లో భాగమైన దర్శకుడు ఆనంద్శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామ్యాన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్లతో పాటు చిత్రయూనిట్ అందరికీ ధన్యవాదలు’’ అని విశాల్ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రం విడుదల తేదీని
త్వరలో ప్రకటించనున్నారు చిత్రయూనిట్.