టైగర్ నాగేశ్వరరావు..సువర్టుపురం దొంగగా పేరుగాంచిన ఇతను ఇప్పుడు టాలీవుడ్లో ఓ ట్రెండీ టాపిక్. ఎదుకంటే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రెండు సినిమాలు రానున్నాయి. కానీ అదీ ఒకే టైమ్లో. అయితే టైగర్ నాగేశ్వరరావు జీవితం బయోపిక్కు ఫస్ట్ రవితేజ పేరే వినిపించింది. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సువర్టుపురం దొంగ టైటిల్తో నాగేశ్వరరావు బయోపిక్ను అనౌన్స్ చేశారు. దీంతో రవితేజ చేయాలనుకున్న సినిమాయే బెల్లంకొండ చేతికి చేరిందని అందరూ అనుకున్నారు. కనీ కథ వేరే ఉందిని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ‘టైగర్: నాగేశ్వరరావు’ బయోపిక్ను అనౌన్స్ చేశారు రవితేజ. పైగా ఇది రవితేజ చేస్తున్న తొలి ప్యాన్ఇండియన్ మూవీ. ఇలా రవితేజ సినిమాను అనౌన్స్ చేశాడో లేదో అలా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫస్ట్లుక్ రానే వచ్చింది. మరీ..ఒకే వ్యక్తి జీవితం ఆధారంగా ఒకే టైమ్లో రెండు సినిమాలంటే పోలికలు కచ్చితంగా ఉంటాయి. మరి..వెండితెరపై యాక్టింగ్లో అసలు సిసలైన దొంగగా ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారనే విషయం తేలడానికి చాలా సమయం ఉంది. అయితే ఈ గ్యాప్లో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వెనక్కి తగ్గిన ఆశ్చర్యం లేదు.
ఒకరి జీవితం..రెండు బయోపిక్లు..పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు!
Leave a comment
Leave a comment