హీరోయిన్ శ్రుతీహాసన్ భలే చాన్స్ దక్కించుకున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీని, ఫైనల్గా ఆ అవకాశాన్ని శ్రుతీహాసన్ దక్కించుకుంది. దీపావళి పండగ సందర్భంగా బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు, క్రాక్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన శ్రుతీ ఇప్పుడు ఈ సినిమా చేస్తుంది. ఇలా గోపీచంద్ మలినేనితో శ్రుతీకి ఇది థర్డ్ మూవీ. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ సలార్ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే.