JaiHanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘హను–మాన్’ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల రూపాయలగ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. 100కోట్లరూపాయాల షేర్ను రాబట్టి అత్యంత లాభదాయకమైన ప్రాజెక్ట్గా నిలిచింది. కె. నిరంజన్రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్వర్మ. 2025లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘హను–మాన్’ లిమిటెడ్ బడ్జెట్లో తీశారు.
కానీ ‘జైహను–మాన్’ను మాత్రం చాలా పెద్ద స్కేల్లో ప్లాన్ చేశారు ప్రశాంత్వర్మ. అంతేకాదు..మార్కెట్ స్ట్రాటజీలను ఫాలో కావాలనుకుంటున్నారు. ఇక ‘జైహనుమాన్’ సినిమాలో రాముని పాత్రలో ఎవరు నటిస్తారు?హనుమంతుడిగా ఎవరు నటిస్తారు? అనే చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాముని పాత్రకోసం మహేశ్బాబు, రామ్చరణ్, బాలకృష్ణ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. హనుమంతుని పాత్ర చేస్తారనే వారిలో చిరంజీవి, రానా, రిషబ్శెట్టి వంటి హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్ తెరపైకి వచ్చింది. హనుమాన్ సినిమాకు హిందీ మార్కెట్లో ఇప్పటివరకు 45కోట్ల రూపాయల గ్రాస్కు వచ్చింది. సో…‘జై హనుమాన్’ సినిమాను గురించి హిందీలోనూ అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ పాత్రలో రణ్వీర్సింగ్ అయితే బాగుంటుందెనని ప్రశాంత్వర్మభావిస్తున్నారట. రణ్వీర్ ఆహార్యం కూడా సూట్ అవుతుందని భావిస్తున్నారట ప్రశాంత్. అంతేకాదు…
ఈ వారంలో రణ్వీర్సింగ్ను కలవనున్నారట ప్రశాంత్వర్మ. మరి..‘జై హనుమాన్’లో రణ్వీర్సింగ్ హనుమంతుని పాత్ర చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.