Tejasajja-Prasanthvarma: ‘హను–మాన్’ సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు ఈ చిత్రం హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హను–మాన్’ సినిమాకు థియేటర్స్లో లాంగ్ రన్ ఉంటుం దన్న వీరిద్దరి నమ్మకం నిజమైంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ‘హను–మాన్’ సినిమా రిలీజ్ కాకుముందే తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్వర్మలు తమ ‘ప్లాన్ బీ’ని రెడీ చేసుకోవడం అనేది ఆసక్తికరం.
తేజా సజ్జా మిరాయి
‘హను–మాన్’ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు చాలా సమయం పడుతుంది. అలాగే రిలీజ్కు కూడా. దీంతో టైమ్ వేస్ట్ చేయకుండ వెంటనే ‘మిరాయి’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ను స్టార్ట్ చేశాడు తేజా సజ్జా. ‘సూర్య వర్సెస్ సూర్య’, రవితేజ ‘ఈగల్’ సినిమాలకు దర్శకత్వం వహించిన కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకుడు.
Jaihanuman Ramcharan: జై హనుమాన్లో శ్రీరాముడిగా రామ్చరణ్?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా తెలిసింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అలాగే ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్సల్మాన్కు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ‘హను–మాన్’ తర్వాత తేజా సజ్జా నుంచే సినిమా కాబట్టి ‘మిరాయి’ మార్కెట్లో మిఠాయిలా అమ్ముడుపోతుందని ఊహించవచ్చు.
ప్రశాంత్వర్మ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’పై ఫుల్ ఫోకస్ పెట్టారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ‘హను–మాన్’ సినిమా ఇందులోనిదే. అలాగే ‘హను–మాన్’కు సీక్వెల్గా రానున్న ‘జై హను–మాన్’ కూడా ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’లోనిదే. అలాగే నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్తో ప్రశాంత్వర్మ ‘అధీర’ సినిమా చేస్తున్నాడు.
‘అధీర: ఫస్ట్స్ట్రైక్’గా ఈ సినిమా రాబోతుంది. ఇది కూడా ‘ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్’లోనిదే. అయితే ‘హను–మాన్’ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ ఓ చిన్న సినిమాను పూర్తి చేశారు. అది ‘అధీర’నా కాదా? అనేది తెలియాలి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.
ఇలా ‘హను–మాన్’ సినిమాను ఒకవైపు రిలీజ్ చేస్తూనే, తేజా సజ్జా, ప్రశాంత్వర్మ ‘ప్లాన్ బీ’లుగా వారి వారి కొత్త ప్రాజెక్ట్స్ను సైలెంట్గా పూర్తి చేయడం అనేది విశేషమే.