Anurag Kashyap: ‘బాంబే టాకీస్’, ‘అగ్లీ’, ‘బాంబే వాలెట్’ వంటి సినిమాలను తీసిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) సుపరిచితులే. నటుడిగాను కొన్ని పాత్రలు చేశారు ఆయన. తమిళ చిత్రం ‘ఇమ్మైక నుడిగల్’లో ఓ లీడ్ రోల్ చేశారు. నయనతార మెయిన్ లీడ్లో కనిపిస్తారు. అయితే ఈ బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ చాలా ఫ్రస్టేషన్కులోనైనట్లున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు అనురాగ్ కశ్యప్ సమాయాన్ని బాగా వృధా చేస్తున్నారట. ఇతరుల వల్ల జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయారట అనురాగ్ కశ్యప్. ఇక లాభంలేదని తన టైమ్కు ఏ రేట్ కార్డును ఫిక్స్ చేసుకున్నారాయన. ఈ రేట్ కార్డు ప్రకారం అనురాగ్ కశ్యప్తో ఎవరైనా పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడాలంటే లక్షరూపాయాలు కట్టాలి. 30 నిమిషాల సమయం స్పెండ్ చేయాలి అంటే రెండు లక్షలు కట్టాలి. గంట అయితే ఐదు లక్షల రూపాయాలు చార్జ్ చేస్తారట ఆ యన.
ఈ విషయాలను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు అనురాగ్ కశ్యప్. ఈ విషయం ఇప్పుడు సినీ
ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్గా మారింది.
‘‘కొత్తవారికి సహాయం చేయాలనుకుని నా సమయాన్ని చాలా వృథా చేసుకున్నాను. అలా నేను చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాలేదు. తమను తాము క్రియేటివ్ జీనియస్లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతోసమావేశమై నా సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. వారి కోసం నా దగ్గర ఓ రేట్ కార్డుఉంది. పది నుంచి పదిహేను నిమిషాలకైతే లక్ష రూపాయలు, అరగంట అయితే రెండు లక్షల రూపాయలు, గంట అయితే ఐదు లక్షల రూపాయాలు చెల్లించండి. ఇలా డబ్బులు చెల్లించగలిగిన వారేనాకు ఫోన్ చేయండి. లేదా నాకు దూరంగా ఉండండి’ అంటూ ఓ ఇన్స్టా స్టోరీని షేర్ చేశారు అనురాగ్కశ్యప్. డబ్బులు చెల్లించి నా సమయాన్ని తీసుకోండి. షార్ట్కట్స్తో సక్సెస్ కావాలనుకునే వారితో నేను విసిగిపోయాను’’ అని క్యాప్షన్ కూడా ఇచ్చుకున్నారు తన పోస్ట్కు. మరి..ఇంతలా అనురాగ్ను విసిగించింది ఎవరు? ఇప్పటికైనా తెలుసుకున్నారు? …ఇలా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.