కోలీవుడ్లో దాదాపు పదిమంది దర్శకులు కలిసి ‘రెయిన్ ఆన్ ఫిలింస్’ ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేసి ఫీచర్ ఫిలింస్, వెబ్సిరీస్లు నిర్మించనున్నారు. ఇందులో తొలి ఫీచర్ ఫిల్మ్ను ‘మానగరం, ఖైదీ, మాస్టర్’ సిని మాలను డైరెక్ట్ చేసిన లొకేశ్ కనగరాజన్ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో సూర్య హీరోగా నటించనున్నారని కోలీవుడ్ టాక్. పాండిరాజ్ డైరెక్షన్లోని ‘ఈటీ’, జ్ఞానవేల్ డైరెక్షన్లోని ‘జైభీమ్’ చిత్రాల షూట్స్ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు సూర్య. ఇక..వెట్రీమారన్ డైరెక్షన్లో సూర్య చేయాల్సిన ‘వాడివాసల్’ సెట్స్పైకి వెళ్లేందుకు కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఈ లోపు లొకేష్తో సినిమా చేయాలను కుంటు న్నారు. ప్రజెంట్ లోకేష్ కమల్తో ‘మాస్టర్’ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగనే లోకేష్–కనగరాజన్ కాంబినేషన్ మూవీ స్టార్ట్ అవుతుందట.