సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శరణ్ గోపిశెట్టి తెరకెక్కిస్తోన్న వెబ్సిరీస్ గాలివాన
.బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఈ వెబ్సిరీస్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రాంతీయ టెలికాం శిక్షణా కేంద్రంలో షూటింగ్ జరుపు కుంటోంది. మంగళవారం ఆన్ లొకేషన్ పాత్రికేయుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా…
సీనియర్ నటి రాధిక గారు మాట్లాడుతూ..నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్ సిరీస్ చేయలేదు. కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్ సిరీస్ చేస్తున్నా. ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ చాలా చక్కగా కుదిరాయి. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ సినిమాలతో బిజీగా ఉన్న నేను ఇప్పటివరకు వెబ్ సిరీస్ కథలు చేయలేదు. అయితే దర్శకుడు శరణ్ చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ ‘గాలివాన’ ప్రేక్షకులనందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది
అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ… ప్రస్తుతం జరుగుతున్న ఈ చివరి షెడ్యూల్తో షూటింగ్ పూర్తవు తుంది“ అన్నారు
జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ పద్మా కస్తూరి రంగన్ మాట్లాడుతూ…మంచి కంటెంట్తో వస్తున్న మా ‘గాలివాన’ సూపర్హిట్ అయి సీజన్ 2 కూడా చేయాలనేదే మా ఆశ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాము
అన్నారు.
దర్శకుడు శరణ్ గోపిశెట్టి మాట్లాడుతూ-“ సీనియర్ యాక్టర్స్తో వెబ్ సిరీస్ చేసే అవకాశం రావడం చాలా ఆనందం కలిగింది. మిక్స్డ్ ఎమోషన్స్తో ఉండే క్రైం థ్రిల్లర్. ఇలాంటివి దర్శకుడికి నిజంగా ఛాలెంజ్ అని చెప్పాలి. రాధిక మేడమ్, సాయికుమార్ గార్లు మా యూనిట్కు ఫ్యామిలీ పెద్దలుగా ఉంటూ మా యూనిట్ని నడిపించారు. ఈ వెబ్ సిరీస్కు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. జీ5 పద్మ, అనురాధ, రాధ, కీర్తి, నీలిమ గార్లు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మంచి కథతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
నటుడు కృష్ణ చైతన్య, నటి చాందిని, నటుడు తాగుబోతు రమేష్, నటి నందిని రాయ్ తదితరులు పాల్గొన్నారు.