Vijayendra Prasad: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ సెట్స్లో కన్నీళ్ళు పెట్టుకున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత –దర్శకుడు విజయేంద్రప్రసాద్
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. 2015లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన హిందీ చిత్రం ‘భజరంగీభాయిజాన్’ (Bajrangi Bhaijaan) బ్లాక్బస్టర్. ఈ సినిమాకు కథ అందించింది విజయేంద్రప్రసాద్. కబీర్ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రాజమౌళికి చెప్పారు విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి: ది బిగినింగ్’ సెట్స్లో ‘భజరంగీ భాయిజాన్’ కథవిన్న రాజమౌళి (Rajamouli) కథలో భావోద్వేగానికి కనెకై్ట, కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక ఈ సినిమాను సల్మాన్ఖాన్తో తీస్తున్నట్లుగా విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) చెప్పారు. సరే అన్నారు రాజమౌళి. అయితే ‘భజరంగీభాయిజాన్’ విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది.
‘‘భజరంగీభాయిజాన్’ కథను మీరు (విజయేంద్రప్రసాద్) నాకు మాంచి వేసవిలో ‘బాహుబలి: ది బిగినింగ్’ సెట్స్లో 2వేలమంది ఉన్న సమయంలో, ఓ యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు చెప్పారు. అందుకే ‘భజరంగీ భాయిజాన్’ కథను ఇచ్చేయన్నట్లుగా చెప్పాను. నేను (రాజమౌళి) కనెక్ట్ కాలేకపోయాను ఆ సమయంలో’’ అని విజ యేంద్రప్రసాద్తో రాజమౌళి చెప్పారట. ఇలా ఓ మంచి క«థను మిస్ అయ్యాం అన్నట్లుగా ఫీలయ్యారట రాజమౌళి. ఈ విషయాలను విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.
అంతేకాదు..‘భజరంగీ భాయిజాన్’ కథను తొలుత విజయేంద్రప్రసాద్ హీరో ఆమీర్ఖాన్కు వినిపించారు. కానీ ఆమిర్ ఒప్పుకోలేదు. దీంతో ఇదే కథను విజయేంద్ర ప్రసాద్ సల్మాన్కు వినిపించి, కథను ఓకే చేయించుకున్నారు. అలా సల్మాన్ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ సినిమా చేశారు. అలా కెరీర్లో హిట్ కొట్టారు సల్మాన్ఖాన్. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ‘భజరంగీ భాయిజాన్’ కథను తాను(ఆమీర్ఖాన్) మిస్ చేసుకున్నానని, గతంలో సూర్య ‘గజిని’ సినిమాను హిందీలో చేయమన్నప్పుడు ముందు తాను వద్దానని, కానీ సూర్య పట్టుబట్టడంతో ‘గజిని’ చేశానని ఆ సినిమా హిట్ అయ్యిందని…అలా మీరు (విజయేంద్రప్రసాద్) కూడా నన్ను ‘భజరంగీ భాయిజాన్’ సినిమా చేసేలా ఒత్తిడి చేసి ఉంటే బాగుండే దన్నట్లుగా విజయేంద్రప్రసాద్తో ఆమీర్ఖాన్ చెప్పారట. ఈ విషయాలను విజయేంద్రప్రసాద్ ఓ ఇంట ర్వ్యూలో వెల్లడించారు. ఇదీ అసలు..సంగతీ.
ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. అఫ్రికన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాత. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.