షేర్షా వంటి బంపర్హిట్ తర్వాత బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మరో యాక్షన్ మూవీ ‘యోధ’. ఈ యాక్షన్ ఫ్రాంచైజీ ‘యోధ’కు కరణ్జోహార్ ప్రొడ్యూసర్. నవంబరు 18న ఈ సిని మాలోని సిద్దార్థ్ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో దిశాపటానీ, రాశీఖన్నా హీరోయిన్స్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ ‘యోధ’ ఫ్రాంచైజీని సాగర్ అంబ్రే, పుష్కర్ జోజా డైరెక్ట్ చేస్తారు. హై జాకింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే ఏడాది నవంబరు 11న విడుదల చేయాలనుకుంటున్నారు.