తెలుగు చిత్రపరిశ్రమలో కొన్నిరోజులుగా ‘మా’ ఎన్నికల హడావిడి అంతా ఇంతా కాదు. సాధారణ ఎన్నికలను తలపించే రితీలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న కొందరు తెలుగు స్టార్స్ మాత్రం తమకు ఏం పట్టన్నట్లు గమ్మున ఉండిపోయారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయలేదు. వెంకటేశ్, మహేశ్బాబు (స్పెయిన్లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్తో బిజీగా ఉన్నారు) ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్దేవరకొండ (తిరుపతి వెళ్లాడు), నితిన్, వరుణ్తేజ్, వైష్ణవ్తేజ్, నాగచైతన్య, సుమంత్ ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఇటు హీరోయిన్స్ అనుష్క, ఇలియానా, త్రిష, రకుల్ప్రీత్ సింగ్ (ఆదివారం రకుల్ బర్త్ డే) వంటి వారు కూడా ఈ ‘మా’ ఎన్నికల్లో పాల్గొనలేదు. హీరోయిన్ జెనీలియా మాత్రం ముంబై నుంచి వచ్చీ ఓటింగ్లో పాల్గొన్నారు.