సైరా:నరసింహారెడ్డి సినిమా తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్వకత్వంలో రూపొందనున్న సినిమా భోళాశంకర్లో హీరోయిన్గా నటిస్తారు. ఈ చిత్రంలో హీరో యిన్ కీర్తీ సురేశ్ మరో కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ కనిపిస్తారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.