బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా ఉన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ 13వ సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్లో సోనూ సూద్, కపిల్ శర్మ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. అయితే ఈ షోలో భాగంగా తన తల్లి సరోజ్ సూద్ను సోనుసూద్ గుర్తుచేసుకుని భావోద్వేగానికిలోనైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంకా తన కోసం తన తల్లి రాసిన ఉత్తరాలను సోను గుర్తు చేసుకోవడం ఈ ఎసిసోడ్కే హైలైట్గా నిలిచింది. ‘‘మా అమ్మగారికి చిన్నతనం నుంచే ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మేం ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పటికీని అమ్మ నాకు ఉత్తరాలు రాసేవారు. అమ్మ అలా ఎందుకు చేస్తున్నారో నాకు మొదట్లో తెలియదు.ఓ సారి అడిగాను. ఫోన్లో మాట్లాడుకున్న రికార్డులు చెరిగిపోతాయి. కానీ ఉత్తరాలు అయితే జ్ఞపకాలుగా ఉండిపోతాయి. భవిష్యత్లో నేను నీ చెంత లేకపోయిన ఆ ఉత్తరాల్లో నన్ను నువ్వు చూసుకోవచ్చన్నారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు అమ్మ నాకు తొందరగానే దూరమయ్యారు. కానీ మా అమ్మ అప్పుడు రాసిన ఉత్తరాలను ఇప్పుడు చదువుతుంటే మా అమ్మ నాతోనే ఉన్నభావన కలుగుతుంది అని సోనుసూద్ అన్నారు. పైగా ఇదే షోలో ఓ లేఖను చదివి వినించడంతో వీక్షకులు కూడా భావోద్వేగానికి లోనైయ్యారు. అలాగే మా అమ్మ ఓ టీచర్ అని, ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ అమ్మ జ్ఞాపకాలను చెప్పేవారని అప్పుడు సంతోషంతో పాటు, గర్వంగా అనిపించేదని సోనుసూద్ అన్నారు.