సినిమా: రజాకార్
నటీనటులు: బాబీ సింహా, వేదిక, ఇంద్రజ, మకరంద్దేశ్పాండే, ప్రేమ, ఇంద్రజ, అనసూయ, అనుష్యా త్రిపాఠి
దర్శకుడు: యాటా సత్యానారాయణ
నిర్మాత: గూడురు నారాయణరెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కథ
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత హైదరాబాద్ సంస్థానం మాత్రం అఖండ భారతంలో విలీనం కాదు. ఇందుకు హైదరాబాద్ను పరిపాలిస్తున్న అప్పటి నిజాం వారసుడు..ఏడో నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్ (మకరంద్ దేశ్పాండే) ఏ మాత్రం ఒప్పుకోడు. దీంతో అప్పటి సెంట్రిల్ మిని స్టర్ సర్థార్ వల్ల భాయ్ పటేల్ (తేజ్ సప్రు) ఉంటారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయా
ల్సిందిగా ఉస్మాన్అలీఖాన్కు స్టాండ్ స్టిల్ టైమ్ ఇస్తారు. అంటే ఈ సమయంలోపు నిజాం సంస్థానంపై
భారత ప్రభుత్వం దురాక్రమణ చర్యలు తీసుకోకూడదు. కానీ ఈ స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని నిజాం రాజు,
అతని ప్రధాన అనుచరులు ఖాసీం రజ్వీ (రాజ్ అర్జున్), లయఖ్లు పెడచెవిన పెడతారు. ముఖ్యంగా ఖాసీం రజ్వీ రజకార్ వ్యవస్థను స్థాపించి దురాక్రమణలకు పాల్పడుతుంటాడు. ఇతనికి హిందూవులు అంటే ఏ మాత్రం పడదు. వారిని బానిసలుగా భావిస్తుంటాడు. నిజం సంస్థానంలోని ప్రజలపై దారుణమైన పన్నులు, మత మార్పుడులు, ఘోరమైన హత్యాచారాలులను రజాకర్లతో చేయిస్తుంటాడు. హైదరాబాద్ను మరో తుర్కీస్థాన్గా మార్చాలన్నది రజ్వీ లక్ష్యమన్నట్లుగా సినిమాలో చూపిస్తారు. నిజాం మరో అనుచరుడు లయఖ్ పాకిస్తాన్తో సంబంధాలు కలిగి ఉంటాడు. మరి..రజ్వీ సృష్టించిన రజాకర్ల వ్యవస్థ తెలంగాణ ప్రజలను ఏ విధంగా పీడించింది? ఇందుకు అప్పటి భారత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది? అన్నది మిగిలిన కథనం
విశ్లేషణ
నిజాం పరిపాలనలో రజాకర్ల ఆకృత్యాలు, ఘోరమైన మారణహోమాలు, మహిళలపై అతిదారుణమైన హత్యాచారాలు జరిగినట్లుగా కొంతమంది చరిత్రకారుల రచనల్లో ఉంది. ఈ విషయాలనే సినిమాలోబలంగా చూపించారు దర్శకుడు యాటా సత్యానారాయణ. అప్పటి హైదరాబాద్ ప్రస్థానంలోని ఉన్న వివిధ ప్రాంతాల్లో రజాకార్లు పాల్పడిన హింసాత్మక ఘటనలతోనే తొలిభాగం అంతా ముగుస్తుంది. రజకార్లపై తిరుగుబాటు చేసిన బనగానపల్లె ఎపిసోడ్తో రెండో భాగం మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ ఓ ఇరవై నిమిషాలకుపైగా ఉంటుంది. ఇలా రజాకార్లపై తిరుగుబాటు చేసిన అప్పటి తెలంగాణ నాయకులు, ప్రాణాలు అర్పించిన వీరుల ఘటనలో కథ ప్రీ క్లైమాక్స్కు చేరుతుంది. భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి హైదరాబాద్లో శాంతిభద్రతలను నెలకొల్పుతుంది. నిజాం రాజు భారతదేశంలో హైదరాబాద్ను వీలినం చేస్తున్నట్లుగా చెప్పడంతో కథ ముగుస్తుంది.
సినిమాలో బతుకమ్మపండగ ఏపిసోడ్, భారత ప్రభుత్వ సైనిక చర్య, రజాకార్లపై ప్రజల తిరుగుబాటులోని కొన్ని సీన్స్ ప్రేక్షకులకు హై ఇస్తాయి. కానీ సినిమాలో మితీమిరిన హింస ఉంటుంది. ప్రతి నిమిషానికి ఓ ఐదారుగురు చనిపోతుంటారు సినిమాలో. పోరాటం, తిరుగుబాటు రెండు హింసాత్మకంగానే చూపించారు దర్శకుడు. హైదరాబాద్ సంస్థానం వీలినం అనేది సర్థార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరి వల్లే సాధ్యమైనట్లుగా దర్శకుడు చెప్పదలచుకున్నాడు. ఇలా బీజేపీ ప్రభుత్వంకు సానుకూలంగా ఉండేలా కథను కాస్త బ్లెండ్ చేశారు దర్శకుడు. కానీ చరిత్రలో రజాకర్ల పాలన నల్గొండ, పరకాల, హైదరాబాద్ దురాఘతాలు ఇలా జరిగాయి అన్న వాటిని అలాగే చూపించడంలో మాత్రం సఫలం అయ్యాడు దర్శకుడు. కానీ కొంతమంది వీరులను గురించి చెప్పలేదు. అప్పట్లో కమ్యూనిస్టులు కూడా రజాకర్లకు కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు. వీరి ప్రస్తావన ఓ పది సెకన్లు ఉంటుంది. చరిత్ర గురించి తెలిసిన వారికి ఇది కరెక్ట్గా అనిపించదు. అలాగే ఈ తరం ఆడియన్స్ను కనెక్ట్ చేయడానికి అప్పటి పాంత్రాల పేర్లు ఇప్పుడు ఏమున్నాయో వెండితెరపై ఎప్పటికప్పుడు చూపిస్తుండటం బాగుంటుంది. ఇలా ఈ తరం ఆడియన్స్ ఈ కథను ఓన్ చేసుకుంటారు.
నటీనటులు
సినిమాలో చాలామంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కథ ప్రకారం వివిధ ప్రాంతాల్లో జరిగే సంఘటనల సమాహారంగా సినిమా ఉంటుంది కాబట్టి వీరి కాంబినేషన్ సీన్స్ ఉండవు. ఏ ఘటనలో ఎవరికి వారే హీరోలు. నిజాం రాజుగా మకరంద్దేశ్పాండే, రజ్వీగా రాజ్ అర్జున్, పటేల్గా రాజ్ సప్రు పాత్రలు సినిమాలో కంటిన్యూస్గా ఉంటాయి. ఈ ముగ్గురు బాగా చేశారు. ముఖ్యంగా రాజ్ అర్జున్ క్రూరమైన రజ్వీగా బాగా నటించాడు. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, పోచమ్మగా అనసూయ మెప్పించారు. నిజాం భార్యగా అనుష్యా త్రిపాఠి కనిపిస్తారు. ముఖ్యంగా అనసూయ బతుకమ్మ ఏపిపోడ్ అయితే ఆడియన్స్ను షాక్కు గురి చేస్తుంది. రజాకార్లు ఇంత దుర్మార్గులా? అనిపిస్తుంది ఆడియన్స్కు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా ఆర్ఆర్ సూపర్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి సన్నివేశంలోను యూనిట్ కష్టం కనపడుతుంది. ఎడిటింగ్ ఒకే. ఆర్ట్ డిపార్ట్మెంట్ను కూడా మెచ్చుకోవాల్సిందే. వారి కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఫైనల్గా…: రజాకార్….తిరుబాటు విజయం (2.75/5)