ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథాలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ బుధవారం ముంబైలో పూర్త యింది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారు. సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపిస్తారు. ఆదిపురుష్ సినిమాను 107 రోజులు షూట్ చేశారు. మైథాలాజికల్ ఫిల్మ్ కావడంతో గ్రాఫిక్స్కు ఎక్కువ సమయం పడుతుంది. ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.