నాగ శౌర్య ,‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ‘వరుడు కావలెను‘ చిత్రం మిమ్మల్ని అలరించటానికి మీముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. కీలక పాత్రల్లో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష కనిపిస్తారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 15న విడుదల కావాల్సింది. కానీ ఈ నెల 29కి వాయిదా వేశారు. అయితే ఏపీలోని థియేటర్స్లో ఇప్పుడు 100శాతం ఆక్యూపెన్సీ ఉండటం ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు.