తెలుగు సినిమాల షూటింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జూలై 12న మహేశ్బాబు ‘సర్కారివారి పాట’ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తిరగి ప్రారంభమైంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్లో పాల్గొంటున్నారు మహేశ్బాబు. ‘సర్కారువారిపాట’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.
బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఓ సాంగ్ చిత్రీకరణను జరుపుతున్నారు.
హీరో రామ్, దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్, అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ సినిమాల షూటింగ్స్ల రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి.
మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్లో పవన్కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జూలై 12న స్టార్ట్ కావాల్సింది కానీ మరో వారం రోజులు వాయిదా వేశారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.