కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోలీవుడ్ టాప్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాలు విడాకులు తీసుకున్నారు. సోమవారం రాత్రి ఈ విషయాన్ని ధనుష్ -ఐశ్వర్యలు అధికారికంగా ప్రకటించారు.
18 సంవత్సరాలుగా స్నేహితులు, దంపతులుగా, తల్లిదండ్రులుగా ఒకరినొకరం అర్ధం చేసుకుంటూ, సర్దుబాటు చేసు కుంటున్నాం.కానీ ఇప్పుడు మా దారులు వేరయ్యాయి. మమ్మల్నీ మేం అర్థం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఒకరినొకరం గౌరవించుకుంటూ దూరమవుతున్నాం. మా నిర్ణయాన్ని మా వ్యక్తిగత జీవితాన్ని అందరు గౌరవించాలని కోరుకుంటున్నాం అని ధనుష్, ఐశ్వర్యారజనీకాంత్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక 2004 నవంబరు 18న వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు యాత్ర, లింగ ఉన్నారు.
రీసెంట్గా టాలీవుడ్లో నాగచైతన్య, సమంత ఇప్పుడు ధనుష్-ఐశ్యర్యాలు విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీస్లో చర్చనీయాంశమైంది. ఇటు ధనుష్, అటు రజనీకాంత్ అభిమానులు కూడా బాధ పడుతున్నారు