సుధీర్బాబు హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శివ మనసులో శృతి’. ఈ చిత్రం విడుదలై నేటికి (ఫిబ్రవరి 10) పదిసంవత్సరాలు పూర్తయ్యాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీడియాతో సుధీర్బాబు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు
నా ఫేస్ సినిమాలకు పనికి రాదన్నాడు
శివ మనసులో శృతి సినిమా షూటింగ్ ఫస్ట్ డే రోజునే తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. నా ఫస్ట్ డే ఫస్ట్ షూట్ రోజున నా సినిమా కెమెరామ్యాన్, అతని అసిస్టెంట్ నా ముఖం సినిమాలకు పనికిరాదన్నట్లుగా చర్చించుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. ఆ తర్వాత ముందు ఆ కెమెరామ్యాన్ను వర్క్ నుంచి తొలగించాను. అతనిపై కోపంతో కాదు. కెరీర్ స్టార్టింగ్లోనే నెగటివ్ ఎనర్జీ సెట్స్లో ఉండకూడదనే భావనతో. ఈ తర్వాత వాళ్లు ఎందుకు అలా మాట్లాడుకున్నారా? అని ఆలోచించాను. ఆల్రెడీ డబ్బులు పెట్టాను. ఇక చేసేది ఏం లేదు కాబట్టి ఏదైనా సరే ఎంత కష్టపడైన సరే నా పెర్ఫార్మెన్స్తోనే సినిమాను ముందుకు తీసు కుని వెళ్లాలనుకుని చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత నన్ను కామెంట్ చేసిన ఆ కెమెరామ్యాన్తో వర్క్ చేయడం జరిగింది. నా ఎదుగుదలకు ఆ కెమెరామ్యాన్స్ మాట్లాడిన మాటలు కూడా ఓ కారణమని ఇప్పుడు అని పిస్తోంది.
కృష్ణవంశీగారు నాకు యాక్టింగ్ రాదన్నారు
ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ, నిర్మాత నటుడు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ సినిమా ఆడిషన్స్కు వెళ్లాను నేను. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అప్పట్లో నాలో ఉన్న యాక్టింగ్ సరి పోదని, ఏదైనా యాక్టింగ్ కోర్సులో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందని కృష్ణవంశీగారు సూచిం చారు. అయితే ఆ తర్వాత నేను కష్టపడి యాక్టర్గా ప్రేక్షకుల మెప్పు పొందగలిగాను
నా బ్యాగ్రౌండ్ను వాడలేదు
సూపర్ కృష్ణగారు, మహేశ్ నాకు బంధువులే. ఇప్పటివరకు నేను 14 సినిమాలు చేశాను. కానీ ఎప్పుడూ కూడా ఫలానా ఫేవర్ చేయమని నేను అడగనే లేదు. నా కష్టంతోనే అవకాశాలను సృష్టించుకున్నాను. అయితే ఇండస్ట్రీలోకి వచ్చేప్పుడు నాకు వీరే ఓ స్ఫూర్తిగా నిలిచారు. ప్రేమకథా చిత్రం సినిమా చూసి
యాక్టర్గా నేను మెరుగుపడ్డానని మంజులతో మహేశ్ చెప్పాడు. నేను హ్యాపీ ఫీలయ్యాను. ఇక మహేశ్తో
యాక్ట్ చేయాలని నాకూ ఉంది. కానీ మంచి కథ కుదరాలి. ఇద్దరి ఇమేజ్లకు తగ్గట్లుగా కథ కుదిరితే తప్ప కుండా చేస్తాం. నేను నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తీస్తున్నాను. అన్నీ కుదిరితే మహేశ్ హీరోగా
నా బ్యానర్లో సినిమా తీస్తాను. అలాగే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో
మహేశ్ను చూసి నేర్చుకున్నాను.
రణ్బీర్కపూర్ సినిమాను వదులుకున్నాను
హిందీలో సాజిత్ నడియాడ్ వాలా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు అస్సలు నమ్మలేదు. ఏదో చిన్న ఫైట్ సీక్వెన్స్ కోసం నన్ను పలిస్తున్నారెమో అనుకున్నాను. కానీ విలన్ రోల్ ఆఫర్ చేయగా ఒకే
అన్నాను. యాక్టర్గా నిరూపించకునే ప్రయత్నంలో ఉన్న నేను అప్పుడు ఎలాంటి కథలైన చేసే మూడ్లో
ఉన్నాను. ఆ తర్వాత హిందీలో రణ్బీర్కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో విలన్గా చేసే చాన్స్ వచ్చింది. అప్పుడే
సమ్మోహనం చేస్తున్నాను. దీంతో ఆ హిందీ ఆఫర్ను వద్దనుకున్నాను. నేను చేసిన 14 సినిమాలూ హిందీలో
డబ్ అయ్యాయి. ప్యాన్ఇండియన్ ఫిల్మ్స్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు.
నా వారసులు హీరోలే
నా కుమారులు ఇద్దరు యాక్టింగ్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. మహేశ్బాబు సర్కారువారి పాట చిత్రంలో దర్శన్
చిన్ననాటి మహేశ్గా చేస్తున్నాడు. నేను హీరోగా హర్షవర్థన్ దర్శకత్వంలోని సినిమాలో చరిత్ మానస్ నా చిన్నప్పటి పాత్ర చేశాడు. భవిష్యత్లో వీరి స్కిల్ డెవలప్మెంట్ కోసం అయితే ఎంతైనా ఖర్చుపెడతాను కానీ ప్రొడ్యూసర్గా అంటే ఇప్పుడే చెప్పలేను. ఇండస్ట్రీలోకి వస్తే వాళ్లు కష్టపడాల్సిందే.
పుల్లెలగోపీచంద్ బయోపిక్ దర్శకుడు మారాడా?
సుధీర్బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం బయోపిక్లో అతనే టైటిల్ రోల్ చేయనున్నాడు. ఈ బయోపిక్ కోసం తొలుత దర్శకుడు ప్రవీణ్ సత్తారు
పేరు వచ్చింది. అయితే ఇప్పుడు సుధీర్బాబు ఈ బయోపిక్కు దర్శకుడు ఎవరు అన్నది త్వరలో చెబు
తాం అని అనడాన్ని బట్టి ప్రవీణ్ సత్తారు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ జంగిల్హౌస్ ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా సుధీర్బాబు చెప్పారు.