గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కాకమర్షియల్ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై చిత్రంబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. కరోన కరుణిస్తే మే 20న ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్స్కు వస్తుందని చిత్రబృందం ప్రక టించింది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ లాయర్గా కనిపిస్తారని తెలిసింది. ఇక పక్కాకమర్షియల్ సినిమాను ఫిబ్రవరి 25న ఆ తర్వాత మార్చి 18న విడుదల చేయాలనుకున్న విష యం విదితమే. ఇక పక్కా కమ ర్షియల్తో పాటుగా శ్రీవాస్ దర్శకత్వంలో గోపీ చంద్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. ఇంత కుముందు వీరి కాంబి నేషన్లోనే లక్ష్యం, లౌక్యం అనే చిత్రాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.