AlluArjun PushpaTheRule: ‘పుష్ప’ సినిమాలోని తొలి పార్టు ‘పుష్ప: ది రైజ్’ సినిమా బంపర్హిట్. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా ‘పుష్ప: ది రూల్’ తీస్తున్నారు మేకర్స్. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి లవ్ఫిల్మ్ తర్వాతహీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత 2023 డిసెంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సరిగా జరగలేదు. పైగా ఈ సమయంలో సుకుమార్ ఓ వేకేషన్కు కూడా వెళ్లొచ్చారు. ఇక 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుని ‘పుష్ప’ టీమ్ చాలా కష్టపడింది.
శరవేగంగా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసింది. కానీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రధారి అయిన కేశవ ఓ కేసులో నిందితుడిగా ఉండటంతో, అతని కాల్షీట్స్ ఇబ్బంది కార ణంగా షూటింగ్ కొంత ఆగింది. ఈ సినిమాలో ఇంట్రవెల్ సమయంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. గంగమ్మజాతర నేపథ్యంలోని ఫైట్ ఇది. ఈ జాతర ఫైట్లో అల్లు అర్జున్కు హెవీ కాస్ట్యూమ్స్ ఉంటాయి. దీంతో వెన్నునొప్పితో బాధపడ్డారు అల్లు అర్జున్. దీంతో అనుకున్న సమయానికి జాతర సీక్వెన్స్ పూర్తి కాలేదు. ఇక ఓ సారి షూటింగ్ పూర్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం సుకుమార్ చాలా టైమ్ తీసుకుంటుంటాడు. పైగా ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్ సమయంలో కూడా ఇది కని పించింది. చివర్లో ఓవర్సీస్లకు సినిమాను పంపారు. ఓ దశలో షోలు పడటం లేదన్నారు అప్పుడు. ఈ సారి ఇలాంటి ఒత్తిడితో సుకుమార్ వర్క్ చేసుకుడదని అనుకోవచ్చు. ఇలా…ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది. ఇక 2021 డిసెంబరులో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ అద్భుత విజయం సాధించింది. దీంతో 2024 డిసెంబరులో ‘పుష్ప: ది రూల్’ సినిమాను విడుదల చేసే ఆలో చనలో ఉన్నారట టీమ్.