2019లో వచ్చిన ‘ఏబీసీడీ’ తర్వాత అల్లు శిరీష్ మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే ఇన్నాళ్ళకు అల్లు శిరీష్కు ఓ కథ నచ్చిందట. అందుకే 2021 నవంబరు 11వ తేదీ తన జీవితంలో మర్చిపోలేని రోజుని, మం చి స్క్రిప్ట్ కుదిరిందని ట్వీట్ చేశాడు శిరీష్. అంతేకాదు..ఇకపై కొంతకాలం సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లుగా కూడా శిరీష్ పేర్కొన్నారు. మరి..శిరీష్కు అంతగా నచ్చిన స్క్రిప్ట్ ఏంటో, ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం శిరీష్ కెరీర్లో 7వది.