2020 సంక్రాంతి సమయంలో సూపర్హిట్ కొట్టి అల్లు అర్జున్ కెరీర్లో ఓ మంచి మైల్స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘అల..వైకుంఠపురుములో..’. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన చిత్రం ఇది. తమన్ అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ బంపర్హిట్ సాధించాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు సంగీత శ్రోతల చెవుల్లో మారుమోగిపోయాయి. అయితే ఈ సిని మా హిందీలో ‘షాబాద్’గా రీమేక్ అవుతోంది. కార్తిక్ ఆర్యన్, కృతీసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రా నికి మాతృక అల..వైకుంఠపురములో సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ ఓ నిర్మాత. కానీ అల ..వైకుంఠపురుములో.. హిందీ రీమేక్ సెట్స్పై ఉండగానే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ను థియే ట్రికల్గా విడుదల చేయాలనుకున్నారు. ‘పుష్ప:ది రైజ్’ సినిమా హిందీ థ్రియేట్రికల్ విషయంలో అల్లు అర్జున్కు, బాలీవుడ్ నిర్మాత మనీష్కు ఉన్న గొడవలే ఇదంతా జరిగింది. ‘అల..వైకుంఠపురములో..’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ను టీవీలో ప్రసారం చేసే ఒప్పందంతో ఈ పంచాయితీ పూర్తయింది.
‘అల..వైకుంఠపురములో..’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం నిర్మాత మనీష్ షారెండు కోట్ల రూపా యాలను ఖర్చు చేశాడట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘తెలుగు అల..వైకుంఠç ³#రములో..’ సినిమాకు ఏ సింగర్స్ అయితే పాటలు పాడారో వారే హిందీ డబ్బింగ్ వెర్షన్లో కూడా పాడారు. అలాగే బోర్డు సీన్ రూమ్ సన్నివేశంలో వచ్చే పాటలను మార్చేశాం. తెలుగు పాటలకు బదులు..హిందీలో ఫేమస్ పాటలు పెట్టాం. ఇదంతా జరగడానికి రెండు కోట్లు ఖర్చయింది. అల..వైకుం ఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 6న టీవీలీ ప్రసారం కానుంది’’ అని పేర్కొన్నారు మనిష్ షా.