సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా విశ్యక్ కందెరావ్ డైరెక్షన్లో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ’స్కైలాబ్’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు.


అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమై పోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్ చానెల్స్, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేశాయి. అలాంటి నేపథ్యంలో తెలంగాణ కరీనంగర్లోని బండ లింగపల్లి అనే గ్రామంలో నివసించే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విష యాలను ఎంటర్టైనింగ్గా చూపిస్తూ ’స్కైలాబ్’ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది.