కల నిజమైందనుటున్నారు ప్రభాస్. ప్రాజెక్ట్ కె షూటింగ్లో భాగంగా ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేస్తోన్న అమితాబ్బచ్చన్తో కలిసి ప్రభాస్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫిబ్రవరి 18న వీరిద్దరి కాంబినేషన్లోని తొలి షాట్ చిత్రీకరణ జరిగింది. ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ-
బాహుబలి ప్రభాస్తో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ పూర్తయింది. అతని శకంలో నటిస్తున్నందుకు సంతోషంగా
ఉంది. ప్రభాస్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నారు. ఇక అతని ప్రతిభ,
హుందాతనం ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. నేర్చుకోవాల్సి ఉందిఅని ట్వీట్ చేశారు.
https://twitter.com/SrBachchan/status/1494740796049956865
అమితాబ్బచ్చన్గారితో కలిసి నటించాలన్న నా కల నిజమైంది. ప్రాజెక్ట్ కె షూటింగ్లో భాగంగా
అమితాబ్బచ్చన్గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది“ అని పేర్కొన్నారు ప్రభాస్.
ఇక ప్రాజెక్ట్ కె విషయానికి వస్తే…నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్బచ్చన్, దీపికాపదుకొనె ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్
హైదరాబాద్లో మొదలైంది. రెండు రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజుల
పాటు జరుగుతుందని తెలిసింది. ప్రాజెక్ట్ కె చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో విడుదల చేస్తామని ఈ
చిత్రం నిర్మాత అశ్వనీదత్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.