Kushita Kallapu: ‘నీతోనే నేను, మనోహరం, చాంగురే బంగార్రాజా’ వంటి సినిమాల్లో నటించారు హైదరాబాదీ అమ్మాయి కుషిత కల్లాపు(Kushita Kallapu). అయితే హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరుకారం’ సినిమాలో కుషిత ఓ చిన్న రోల్ చేశారు. నాలుగు రోజులు షూటింగ్లో కూడా పాల్గొన్నారు. 2023 జూలైలో ‘గుంటూరు కారం’ సినిమా సెట్స్లో కుషిత జాయిన్ అయ్యారు. కానీ తీరా వెండితెరపై చూస్తే కుషిత కనిపించలేదు. కాగా ఇలా జరగడం తనను చాలా బాధపెట్టిందని, కుషిత వాపోయారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె హీరోయిన్గా నటించిన ‘బాబు నెంబర్ 1 బుల్ షిట్’ సినిమా మార్చి 8న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న కుషిత ‘గుంటూరు కారం’ సినిమా తాలుకూ విషయాలను ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.
#KushitaKallapupic.twitter.com/Uc3ULtQX9b
— TollywoodHub (@tollywoodhub8) February 20, 2024
‘‘నాలుగు రోజులు నేను ‘గుంటూరు కారం’ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యాను. నా సీన్స్ సినిమాలో రాలేదు. నావే కాదు..నాతో పాటు యాక్ట్ చేసిన మరికొందరి సన్నివేశాలు కూడా సినిమాలో లేవు. బాగాఫీలయ్యాను. కానీ చేసేది ఏమీ లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి’’ అని చెప్పుకొచ్చారు కుషిత. ఇక సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమా యావరేజ్ ఫిల్మ్గానిలిచింది. ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.