‘జనతాగ్యారేజ్’ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెర కెక్కనుంది. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావా ల్సింది. కానీ ‘ఆచార్య’ సినిమా ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ను మార్చి 20న స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రంయూనిట్. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ కోసం వర్క్ చేస్తున్నారు కొరటాల శివ అండ్ కో. అయితే ఈసినిమాను షూటింగ్ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారట కొరటాల శివ. ముందు హైదరాబాద్ ఆ తర్వాత గోవా తదితర లొకేషన్స్లో షూటింగ్స్ను ప్లాన్ చేశారట కొరటాల అండ్ కో. కళ్యాణ్రామ్, కె. హరికృష్ణ, యువసుధ ఆర్ట్స్ సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్స్లో రిలీజ్ కానుంది.
ఇక ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాషూటింగ్ ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కానున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్నీల్లతో ఎన్టీఆర్ హీరోగా చేయాల్సిన ప్రాజెక్ట్లు సెట్స్పైకి వెళ్లకముందే మరో వార్త తెరపైకి వచ్చింది. అదే..ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబినేషన్. తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ గతంలో ఎన్టీఆర్కు కథలు వినిపించిన సంగతి తెలి సిందే. అయితే వీటిలో ఓ కథను ఒకే చేశారట ఎన్టీఆర్. ఇది రెండు భాగాలుగా రానున్న సినిమా అని, ఇందులోని తొలి భాగంలో ఎన్టీఆర్, రెండో భాగంలో ధనుష్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా, ప్రస్తుతం సూరి, విజయ్సేతుపతిల కాంబినేషన్లోవెట్రిమారన్ విడుదలై అనే ఓ సినిమా తీస్తున్నారు. ఇది కూడా రెండు భాగాల కథే. తొలి భాగం ఈ ఏడాదివేసవిలో విడుదల కానుంది.