సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ మొదలైంది చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భార్య నుంచి విడా కులు తీసుకున్న ఓ యువకుడు, తన విడాకుల కేసును టేకప్ చేసిన న్యాయవాదితోనే ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న కోణంలో మళ్లీ మొదలైంది చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ కనిపిస్తారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా, అనూప్రూబెన్స్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ‘జీ 5’ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్ గా ఫిబ్రవరిలో విడుదల కానుంది. త్వరలో స్ట్రీమింగ్ తేదీపై ఓ స్పష్టత రానుంది.