2017లో పవన్కల్యాన్ ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత మూడు సంవత్సరాలు తెలుగులో సినిమా చేయని శ్రుతీహాసన్ మళ్లీ 2021లో వచ్చిన రవితేజ ‘క్రాక్’లో వెండితెరపై కనిపించారు. అలాగే ఇదే ఏడాది పవన్కల్యాణ్ ‘వకీల్సాబ్’లోనూ మెరిశారీ బ్యూటీ. ‘క్రాక్’, ‘వకీల్సాబ్’ చిత్రాలు బంపర్హిట్స్ కొట్టడంతో శ్రుతీకి తిరిగి టాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తోన్న ‘సలార్’, ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేయనున్న సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. అయితే జనవరి 28న శ్రుతీహాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సలార్’ చిత్రం నుంచి శ్రుతీహాసన్ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘సలార్’ చిత్రంలో ఆద్య అనే పాత్రలో కనిపిస్తారు శ్రుతీ హాసన్. అయితే ఈ చిత్రంలో ఆద్య అనే జర్నలిస్టు పాత్రలో శ్రుతీహాసన్ కనిపిస్తారని సమాచారం.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘సలార్’ షూటింగ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ‘సలార్’ సిని మాను మొదట్లో ఈ ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘సలార్’ సినిమా దసరాకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ రెండు షెడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నారు. జగపతిబాబు విలన్గా కనిపిస్తారు.