రెండు పార్టులుగా వచ్చిన రాజమౌళి ‘బాహుబలి’ సంచలన రికార్డ్స్ను నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఇదే ఫార్ములాతో వచ్చిన ప్రశాంత్నీల్ ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’ కూడా ఓ రేంజ్ కలెక్షన్స్ను రాబట్టగలిగింది. బాహుబలి, కేజీఎఫ్ల ఫార్ములాను ఫాలో అయిన ‘పుష్ప’ చిత్రం ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’గా రెండు భాగాలుగా విడిపోయింది. గత ఏడాది విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ను రాబట్టింది. దీంతో తాజాగా ‘సలార్’ సినిమా కూడా రెండు పార్టులుగా రానుందనే టాక్ ఇండస్ట్రీలో ప్రచారం అవుతోంది. ఇదే నిజమైతే ‘బాహుబలి’తర్వాత రెండు పార్టులుగా రానున్న చిత్రం ‘సలార్’యే అవుతుంది. అయితే కేజీఎఫ్ను రెండు పార్టులుగా తీసిన ప్రశాంత్నీల్ ఇప్పుడు ‘సలార్’ను కూడా రెండు పార్టులుగా తీసేందుకు రెడీఅవుతుండటం విశేషం.
ఇక 1970 బ్యాక్డ్రాప్లో సాగే ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. తండ్రీ కొడుకులగా కనిపిస్తారని లేదు ఇందులోని రెండు క్యారెక్టర్స్లో ఒకరి ఆర్మీ ఆఫీసర్ అయితే మరొకటి ఓ ముఠానాయకుడు అనే ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్లుగానే ‘సలార్’ చిత్రం నుంచి ప్రభాస్ పాత్రకు సంబంధించిన రెండులుక్స్ విడుదలైయ్యాయి. మరి..‘సలార్’ రెండు పార్టులుగా వస్తుందా? లేదా అనే విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో జగపతిబాబు ఓ కీ రోల్చేస్తున్నారు. ‘సలార్’ చిత్రం ఈ ఏడాది చివరల్లో విడుదల కానున్నట్లుగా శ్రుతీహాసన్ ఇటీవల తన ఇంట ర్వ్యూలో చెప్పారు.