ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది మార్చి 11న ప్యాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రభాస్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేశారు. యూవీక్రియేషన్స్, గోపీకృష్ణామూవీస్ ఈ సినిమాను నిర్మించాయి. ఫిబ్రవరి 2న ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. పునర్జన్మల నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే, పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. ఓ ప్రకృత్తి విపత్తు కారణంగా విడిపోయిన ఓ ప్రేమజంట మరు జన్మలో ఎలా కలుసుకున్నారు? అన్నదే కథ. అయితే ఈ ప్రకృతి విపత్తు గురించి విక్రమాదిత్య ముందుగానే తెలుసుకుంటాడట. కానీ ప్రేరణకు చెప్పకుండా, తాను కూడా ఎందుకు చనిపోవాలనుకుంటాడు? అనేది సినిమాలో ఆసక్తికర అంశం. అందుకే సినిమా పోస్టర్స్పై విధికి, ప్రేమకు మధ్య యుద్ధం అనే ట్యాగ్లైన్స్ కనిపిస్తున్నాయి
అలాగే ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే అని చెప్పవచ్చు. మార్చి 11న ‘రాధేశ్యామ్’ విడుదల అవుతుంది. ఆగస్టు 8న ‘ఆదిపురుష్’, ఈ ఏడాది చివర్లో ‘సలార్’ ఫస్ట్ పార్టు ఇలా…అన్నీ కుదిరితే ప్రభాస్ ఈ ఏడాది మూడుసార్లు సిల్వర్స్క్రీన్పై కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు 2023లో విడుదల అవుతాయి.