‘బాహుబలి’తో ప్రభాస్, ‘కేజీఎఫ్’తో యశ్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ను తిరగరాశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల జాబితాలో ‘బాహుబలి: ది కన్క్లూజన్’,‘కేజీఎఫ్:చాఫ్టర్ 2’ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిన చిత్రాలే.అలాంటి వీరిద్దరు కలిసి ఇప్పుడు ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంటే మరోసారి బాక్సాఫీస్ లెక్కల్లో కొత్త రికార్డులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. 2023, జనవరి 25న విడుదలైన షారుక్ఖాన్ ‘పఠాన్’ చిత్రం హిందీ బాక్సాఫీస్ లెక్కలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి దఫాలోనే అత్యధిక గ్రాస్కలెక్షన్స్ను సాధించిన హిందీ చిత్రంగా, హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా నిలి చింది.
యశ్తో ‘కేజీఎఫ్’ తీసిన తెలుగు మూలాలు ఉన్న కన్నడ దర్శకుడు ప్రశాంత్నీల్ ఇప్పుడు ప్రభాస్తో ‘సలార్’ తీస్తున్నాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా రీసెంట్ షెడ్యూల్ ఇటలీలో జరిగింది. సలార్ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న సమయంలోనే యశ్ కూడా యూరప్లో ఉన్నారు. దీంతో ‘సలార్’లో ప్రభాస్, యశ్ కలిసి నటిస్తున్నారని, వీరిద్దరి కాంబినేషన్ సన్నివేశాలు సినిమా క్లైమాక్స్లో వస్తాయన్న టాక్టాలీవుడ్లో బలంగా వినిపిస్తుంది. ఇదే నిజమైతే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘పఠాన్’ క్రియేట్ చేసిన సరికొత్త రికార్డులు మాయమవ్వడం ఖాయం. శ్రుతీహాసన్ హీరోయిన్గా, కీలక పాత్రలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘సలార్’ సినిమాను హోంబిలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నా రు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న థియేటర్స్లో రిలీజ్ కానుంది