2015 నుంచి చూస్తే ఒక్క సీటీమార్(2021) తప్ప గోపీచంద్(Gopichand) కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా లేదు. అయితే గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ ఈ నెల 5న విడుదల అవుతుంది. ‘లక్ష్యం’, ‘లౌ క్యం’ చిత్రాల తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. కోల్కతా బ్యాక్ డ్రాప్తో ఫుడ్మాఫియా డ్రామాగా రూపొందిన చిత్రం ఇది.
కాగా ఈ సినిమా తర్వాత గోపీచంద్ సినిమా ఎవరితో ఉంటుంది? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. నాలుగు సంవత్సరాలుగా మెగాఫోన్ పట్టని దర్శ కుడు శ్రీనువైట్ల గత ఏడాది దసరాకుతన నెక్ట్స్ ఫిల్మ్ గోపీచంద్తో ఉంటుందని ట్విటర్లో ట్వీట్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఏమైందో తెలి యదు కానీ ఆ తర్వాత శ్రీనువైట్ల యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో ఓ సినిమా చేయాలనిప్రయత్నించారు. కానీ కుదర్లేదు.
మరోవైపు దర్శకుడు తేజతో ఓ సినిమా ఉంటుందని గోపీచంద్ పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితంగోపీచంద్తో ‘అలివేలు వెంకటరమణ’ సినిమాను ప్లాన్ చేశారు తేజ. కానీ ఇది సెట్స్పైకి వెళ్లలేదు. అదిఇప్పుడు సెట్స్పైకి వెళ్తుందని, ఈ సినిమాలోని స్ట్రాంగ్ హీరోయిన్ రోల్కు సరైన కథానాయిక దొరికిన వెంటనే ఈ సినిమాను మరోసారీ ప్రకటించనున్నారు. ఇది సరే..కానీ శ్రీనువైట్లతో గోపీచంద్ ఫిల్మ్మాత్రం క్యాన్సిల్ అయ్యిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపించకుండ ఉండాలంటే ఈ సినిమాపై మరోఅప్డేట్ రావాల్సి ఉంది.