బాలీవుడ్ హీరోలు అక్షయ్కుమార్, టైగర్ష్రాఫ్ హీరోలుగా హిందీలో ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా ఖరారైంది. బాలీవుడ్లో సుల్తాన్, టైగర్ జిందా హై వంటి సినిమాను తీసిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకుడు. బడే మియాన్ చోటే మియాన్ సినిమా అధికారిక ప్రకటన మంగళవారం వెల్లడైంది.
అలాగే ఫుల్యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వాసు భగ్నానీ, దిప్సికా దేశ్ముఖ్, జాకీ భగ్నానీ, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్జాఫర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒకరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కాగా, మరొకరు రకుల్ప్రీత్ సింగ్ అని బాలీవుడ్ టాక్. ఇప్పటికే అరడజనకు పైగా సినిమాలు చేస్తూ బాలీవుడ్లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలో ఈ సినిమా కూడా చేరితే రకుల్ బాలీవుడ్లో అన్స్టాపబుల్ అనే చెప్పవచ్చు.