tollywood: టాలీవుడ్లో షూటింగ్స్ను నిలిపివేశారు. కరోనా తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్స్ను నిలిపివేస్తున్నట్లుగా యాక్టివ్ తెలుగు ఫిలం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇటీవల ప్రకటించింది. అయితే తాజాగా ఈ నిర్ణయానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలపడంతో చిత్రీకరణలు నిలిచిపోయాయి. కేవలం తెలుగు సినిమాల చిత్రీకరణలే నిలిచిపోయాయి. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు షూటింగ్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలిపారు. ఇండస్ట్రీకి సబంధించిన 24 క్రాఫ్ట్స్లో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారమార్గాలను ఆలోచించే క్రమంలోనే షూటింగ్లను నిలిపివేశామని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు కె. బసిరెడ్డి తెలిపారు. రీసెంట్ టైమ్స్లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళం, థియేటర్స్కు ప్రేక్షకుల రావడంబాగా తగ్గిపోవడం, ప్రేక్షకుల రాక తగ్గిపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కు వీపరితంగా నష్టాలు రావడం, విడుదలైన సినిమాలు నెలరోజుల లోపే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రత్యక్షం కావడం వంటి కారణాలు షూటింగ్స్ బంద్కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. తెరపైకి రాకపోయినప్పటికీనితారల భారీ పారితోషికాలు, సినీ కార్మికులు వేతనాలను పెంచమని స్ట్రైక్ చేయడం వంటి అంశాలు కూడా ప్రధానకారణాలుగా కనిపిస్తున్నాయి.