Rajamouli: మహేశ్బాబు తర్వాతి చిత్రం రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కనుంది. కేఎల్ నారాయణ నిర్మాత. ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో భాగంగా మహేశ్బాబు ప్రజెంట్ జర్మనీలో ఉన్నారు. శిక్షణ తీసుకుం టున్నా రు. అయితే సాధారణంగా రాజమౌళితో సినిమా కమిటైన హీరోలు, మరో సినిమాను వెంటనే ఒప్పు కోరు. ఇందుకు రాజమౌళి కూడా అంత సులభంగా సమ్మతించరు. అయితే సూపర్డూపర్ బ్లాక్బస్టర్ ‘హను– మాన్’కు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. అయితే ఈ సినిమాలో రాముడిగా మహేశ్బాబు, హనుమంతునిగా చిరంజీవి నటిస్తే బాగుంటుందని, ఈ విషయమై వారిని సంప్రదించాలని కూడా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మహేశ్ను ఓ మైథలాజీ ఫిల్మ్లో చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ కోరిక. మణిరత్నంలో డైరెక్షన్లోని ‘పొన్ని యిన్ సెల్వన్’ లో మహేశ్బాబు ఓ రోల్ చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ‘జై హనుమాన్’ సినిమాలో శ్రీరాముడి పాత్రలో మహేశ్ చేసే చాన్స్. ఒకవేళ మహేశ్కు ఆసక్తిఉన్నా, ఇందుకు రాజమౌళి ఒప్పుకుంటారో లేదో అన్న డౌట్ మహేశ్బాబు అభిమానుల్లో ఉంది.
అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నప్పడు ‘అచార్య’ సినిమాలో భాగం కావడానికి రామ్చరణ్కు చాన్స్ ఇచ్చాడు రాజమౌళి. ఇందులో చిరంజీవి హీరో. చిరంజీవి సతీమణి సురేఖ , తండ్రీకొడుకులను ఓ ఫ్రేమ్లో చూడాలన్నట్లుగా రాజమౌళిని కోరగా ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి, రామ్చరణ్ నటించారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తర్వాత ‘ఆచార్య’ను విడుదల చేసుకోవాలని అప్పట్లో రాజమౌళి కండీషన్ పెట్టారు. అన్నట్లే ‘ఆర్ఆర్ఆర్’మార్చిలో విడుదల అయితే, ‘ఆచార్య’ వేసవిలో విడుదలైంది.